భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అజరామరమని మంత్రి కొనియాడారు. అటువంటి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ భారతదేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.