పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ సర్కారుపై యువతకు పూర్తి విశ్వాసం ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ (ఆర్వీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, ఇప్పుడేదో చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను పెడదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున మంత్రి
సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 16 : అరవై ఏండ్లకు పైగా అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణను పోరాడి సాధించిన సీఎం కేసీఆర్ నాయకత్వంపై అన్ని రంగాల ప్రజలతో పాటు యువత సైతం పూర్తి నమ్మకంగా ఉన్నట్లు బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. ఎన్నో ఏండ్లు పాలించి ఏమాత్రం అభివృధ్ధి చేయకపోగా ఇప్పుడేదో కొత్తగా చేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్తున్న మాయ మాటలు నమ్మే పరిస్థితిలో వారు లేరన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్ (ఆర్వీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో సుమారు 450 మంది యువకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఎన్నో ఏండ్లు తెలంగాణ ప్రాంతాన్ని పాలించడంతో పాటు ప్రస్తుతం వాళ్లు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇచ్చిన హామీలన్నీ పత్రాలకే పరిమితమయ్యాయే తప్పా అమలుకు నోచుకోని విషయాన్ని అంతా తెలుసుకున్నట్లు చెప్పారు.
ఏది వాస్తవమో ఏది అవాస్తవమో యువత గమనిస్తున్నారని, స్వలాభం కోసం, స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను పెడదోవ పట్టిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు అన్ని రంగాల ప్రజలతో పాటు యువత సైతం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మాట తప్పని, మడమ తిప్పని గొప్ప నాయుకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అందరి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతర అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని.. చెప్పిన దానికంటే కూడా ఎక్కువే చేసినట్లు తెలిపారు. గత పదేండ్లుగా కోట్లాది రూపాయలతో ఎవరూ ఊహించని రీతిలో సంపద పెంచుకుంటూ సంక్షేమాన్ని రెట్టింపు చేసుకుంటూ కొనసాగుతున్న నిరంతర అభివృద్ధి పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు.
అటువంటి ప్రశాంతతలో మళ్లీ చిచ్చులు పెట్టేందుకు, మన సంపదను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కట్టబెట్టేందుకు దొంగలంతా ఏకమై వస్తున్నారని తస్తాత్ జాగ్రత్త అని సూచించారు. ఈ సందర్భంగా యువత అంతా ముక్తకంఠంతో మంత్రికి తమ మద్దతు ప్రకటించారు. అనంతరం సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తోనే అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమమని ప్రజలు నమ్ముతున్నట్లు అందుకే స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సమాచార శాఖ మాజీ కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, నల్లగొండ అంజి, వెంకటేశ్, ఆయా మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.