మోతె, ఫిబ్రవరి 2 : బీఆర్ఎస్తోనే దేశానికి వెలుగు అని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మామిళ్లగూడెంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ లింగారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సహా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు 500 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ ప్రలోభాలు లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. మోదీ ప్రభుత్వం విఫలమైతే ప్రశ్నించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మోదీకి కార్యకర్తగా రాహుల్ మారాడన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని తెలంగాణను నంబర్వన్గా నిలబెట్టిన గొప్ప పాలకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కొత్త నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ తరహా పథకాలు ఎక్కడా లేవని, పథకాల కోసం నలుమూలల నుంచి మన ప్రాంతానికి వలస వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో తెలియని కోదాడ ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి, సీఎం కేసీఆర్ పాలనలో కోదాడలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కోదాడ ఎంపీపీ చింతా కవిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, ఏలూరు వెంకటేశ్వర్రావు, సుంకరి అజయ్కుమార్, మిక్కిలినేని సతీశ్, రామకోటయ్య, జాన్పాషా, కారింగుల శ్రీనివాస్, నూకల శ్రీనివాస్రెడ్డి, ఉపేందర్, దేవ్లానాయక్, వెంకన్న, పొనుగోటి నరసింహారావు, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్కు రాజీనామా
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీలోని 9వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేసి మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బూత్కూరి వెంకట్రెడ్డితోపాటు 50 మంది నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్లో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, క్రమశిక్షణతో కూడిన బాధ్యతలు అలవర్చుకోవాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు మట్టిపల్లి కవితావీరు, కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, చింతా స్వాతీశివమూర్తి, కొండ శ్రీను, చౌగోని అఖిలాలక్ష్మణ్, బానోతు వెంకన్న, పోతుల సునీతారవీందర్, గడ్డం స్వామి, గర్షకోటి సైదులు, పల్లె విజయ్, చౌగోని రాములమ్మాసైదులు, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, దైద పరమేశం, గుర్రం గణేశ్ పాల్గొన్నారు.