రామగిరి, డిసెంబర్ 21: ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెన్నైలో జరగుతున్న సౌత్ జోన్ స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో ఎంజీయూ జట్టు తొలి మ్యాచ్ విజయం సాధించినట్లు యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి బుధవారం తెలిపారు.
అమిత్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న మహిళా కబడ్డీలో క్రిస్ట్ యూనివర్సిటీ జట్టుపై ఎంజీయూ టీం 39-08 పాయింట్ల తేడాతో విజ యం సాధించారని చెప్పారు. విద్యార్థులకు ఎంజీ యూ పీడీలు డాక్టర్ వై.శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ ఆర్.మరళి అభినందనలు తెలిపారు.