రామగిరి, డిసెంబర్ 13: జాతీయ స్థాయిలో యూనివర్సిటీ పోటీల్లో ఎంజీయూ క్రీడాకారులు ప్రతిభ చూపి ఖ్యాతి చాటాలని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి సూచించారు. నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్(ఐసీటీ) పోటీల్లో భాగంగా మంగళవారం క్రాస్కంట్రీ పురుషులు, మహిళాల పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం వర్సిటీ జట్లను ఎంపిక చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజీయూ పీడీలు డాక్టర్ వై.శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ ఆర్.మురళీ, ఎన్జీ కళాశాల పీడీ కడారి మల్లేశ్, వివిధ కళాశాలల పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ క్రాస్ కంట్రీ జట్లు
మహిళా జట్టు: కుష్బూ- జోనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కట్టంగూరు, అంకిత-టీఎస్డబ్ల్యూఆర్డీసీ-నల్లగొండ, సాఫీయా, అఖిల, స్నేహలత-టీఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్డీసీడబ్ల్యూ-భువనగిరి, అభిత – టీటీఆర్డీసీడబ్ల్యూ- సూర్యాపేట.పురుషుల జట్టు : వి.ధనుష్ ఎన్జీ కళాశాల నల్లగొండ, జె.మహేశ్యాదవ్ , శ్రీ కృష్ణాకాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – హలియా, జి.సునీల్, సాయి నిఖిల్కుమార్- ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాల భువనగిరి, పి. అంజి -ఎంసీఎం డిగ్రీ కళాశాల హాలియా, ఎస్. అఖిల్కుమార్- జోనా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కట్టంగూర్.
పేపర్ వాల్యూయేషన్ పారితోషికంపెంచాలని వీసీకి వినతి
ఎంజీయూలో నిర్వహించే పరీక్షల పేపర్ వాల్యూయేషన్ రెమ్యునరేషన్ పెంచాలని మంగళవారం వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డికి తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి రాజారాం ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు.