భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, రామన్నపేటలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నందికొండలో ఎమ్మెల్యే నోముల భగత్, చౌటుప్పల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట, సెప్టెంబర్ 10 : తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతిలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ సాధన ఉద్యమానికి నాంది పలికిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ పోరాట యోధులకు సమున్నత రీతిలో స్మరించుకుంటుందన్నారు. రామన్నపేట రైల్వేస్టేషన్లో ఫలక్నుమా, నారాయణాద్రి రైళ్లు ఆపే విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైల్వే స్టేషన్లో మరమతులకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రజకసంఘం మండలాధ్యక్షుడు కొండూరు శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బందెల రాములు, మండల కార్యదర్శి పోశబోయిన మల్లేశం, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, ఆవుల నరేందర్, మామిండ్ల అశోక్, ఎండీ నాసర్, బాలగోని గణేశ్, ఆవుల శ్రీధర్, నోముల శంకర్, వంగాల సంపత్, ఉడుతల శ్రీను, దామెర నర్సింహ, మాండ్ర మల్లేశం, అక్కెనపల్లి రాజు, దావునూరి నరేశ్ పాల్గొన్నారు.
ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల నివాళి
చౌటుప్పల్ : స్థానిక బస్టాండ్ ఆవరణంలో రజక సంక్షేమ సంఘం ఆధ్వరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొని ఆమె కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, నాయకులు బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్రెడ్డి, గిర్కటి నిరంజన్ గౌడ్, బాబాషరిఫ్, గోపగోని లక్ష్మణ్, ఊడుగు మల్లేశ్గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, తాడూరి పరమేశ్, తడక కిరణ్, కానుగు బాలరాజు, బాతరాజు యాదగిరి, కానుగు మల్లేశం పాల్గొన్నారు.
నందికొండ : రజకుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ హిల్కాలనీలో ఆదివారం నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విజయవిహార్ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రజకుల దుకాణాలకు ఉచిత కరెంట్, ప్రతి మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల వ్యయంతో దోభీఘాట్లను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. చాకలి ఐలమ్మ బాటలో నడుస్తూ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కర్న అనూషాశరత్రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, కౌన్సిలర్ మంగ్తానాయక్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఆవులదొడ్డి రాహుల్యాదవ్, రజక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బాల ఈశ్వర్, నాయకులు ఊర శ్రీను, కృష్ణ, గుజ్జుల కొండలు, చంద్రమౌలి, మధు, నాగార్జున, వెంకట్ పాల్గొన్నారు.
నల్లగొండ : చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి, చిత్ర పటాలకు రజకసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నల్లగొండ రూరల్ : ధీర వనిత చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాగర్రోడ్డులో రజక భవన్ వద్ద రజక సంక్షేమ భవన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చి ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిల్చిన వీర వనిత ఐలమ్మ అన్నారు. గత పాలకులు రజకులను విస్మరించినప్పటికీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రజకుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రజకులకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్, అభిమన్యు శ్రీనివాస్, సంపత్రెడ్డి, దుడుకు లక్ష్మీనారాయణ, రజక సంఘాల ప్రతినిధులు చెన్నయ్య, ఆమంచి ఆంజయ్య, రాములు, సతీశ్, సత్తయ్య, శంకర్ పాల్గొన్నారు.