నల్లగొండ : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. భూవివాదం కారణంగా పురుగుల మందు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుట్టంగండి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పుట్టంగండి గ్రామానికి చెందిన మోహన్కు అతడి పక్క పొలం వ్యక్తికి మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నాయి. ఇవాళ గొడవ కాస్త పెద్దది కావడంతో మనస్తాపం చెందిన మోహన్ పురుగుల మందు తాగాడు. స్థానికులు గుర్తించి హుటాహుటిన దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.