– సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తమ రావు
రామగిరి, జూన్ 19 : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 20 (శనివారం) నాడు నల్లగొండ జిల్లాలో ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని న్యాయ సేవ సదన్, జిల్లా కోర్ట్ భవన సముదాయం నందు “జాతీయ లోక్ అదాలత్” నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తమ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన కేసులు అలాగే ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. కావునా కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.