కురుస్తున్న వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. మెట్ట పంటలు జీవం పోసుకున్నాయి.
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 5 : మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుంటలు, చెరువుల్లో వరద ఉధృతి పెరిగింది. వానలకు ప్రాంతాలకు పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో కురుస్తున్న వర్షం కారణంగా ఆయా గ్రామాలకు వెళ్లే దారిని అధికారులు మూసివేశారు. భూదాన్పోచంపల్లి మండలం జూలూరు-రుద్రవెల్లి గ్రామాల మధ్య లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీనది ప్రవాహం, వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు, పోలీసులు ఇరుగ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేసి బందోబస్తును నిర్వహిస్తున్నారు. వలిగొండలో మూసీ నది వద్ద వరద ఉధృతి పెరిగింది. పలు గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాల వల్ల రహదారులు జలమయమై ప్రజలు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అత్యధికంగా 59.4మిల్లీ మీటర్లు వర్షపాతం
మూడ్రోజులుగా ముసురు కురుస్తున్నా మంగళవారం కొద్దిగా పెరిగింది. యాదగిరిగుట్టలో అత్యధికంగా 59.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, జిల్లాలో సగటున 28.3 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురవగా ప్రజలు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉధృతంగా మూసీ నదిమూసీ నది దిగువ ప్రాంతాల ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి: తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి
వలిగొండ : వలిగొండ మండల పరిధిలో మూసీ నదికి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి కోరారు. మంగళవారం భీమలింగంకత్వా సంగెం బొల్లేపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెనపైకి భారీగా నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది ప్రవాహాన్ని ఎస్ఐ ప్రభాకర్, రెవె న్యూ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించి బ్రిడ్జిపై ఇరువైపులా రాకపోకలు నిషేధించే ప్రమా ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
జిల్లాలో వర్షపాతం ఇలా..
యాదగిరిగుట్టలో 59.4 మిల్లీ మీ టర్లు, బొమ్మలరామారంలో 52.4, రాజాపేటలో 48.4, తుర్కపల్లి(ఎం), భువనగిరిలో45.4, బీబీనగర్, భూదాన్పోచంపల్లిలో 38.4, వలిగొండలో 26.8, ఆలేరులో 24.8, సంస్థాన్నారాయణపూర్లో 20.8, మోటకొండూరు లో 20, గుండాలలో 18.6, చౌటుప్పల్లో 15.6, రామన్నపేటలో 13, మో త్కూరులో 7.2, ఆత్మకూరు(ఎం)లో 6.4, అడ్డగూడూరులో 0.6 మిల్లీ మీట ర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
బీబీనగర్ /భూదాన్ పోచంపల్లి : ముసురుకు బీబీనగర్ పట్టణంలోని సా యి బాబా గుడి ఆవరణలో గల 132 కేవీ విద్యుత్ వైరు తెగి కిందపడిపోయింది. దాంతో పలు కాలనీల్లో విద్యుత సరఫ రాకు అంతరాయం ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే మరమ్మతు చేపట్టి సమస్యను పరిష్కరించారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి గ్రామం వద్ద మూసీ వంతెనపై నుంచినీరు ప్రవహించి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో అధికారులు, పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో మూసీ బ్రిడ్జిని బీబీనగర్లో తాసీల్దార్ శ్రీధర్, భూదాన్ పోచంపల్లిలో తాసీల్దార్ వీరబాయి సందర్శించి పరిశీలించారు.
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ : అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు సమయాల్లో ఆయా ప్రాంతాల్లో వర్షం పడింది. అత్యధికంగా మిర్యాలగూడలో 45.8 మిల్లీ మీటర్ల .వర్షం పడగా దామర చర్లలో 42.0, అనుములలో 31.5, అడవి దేవులపల్లిలో 31.0, త్రిపురారంలో 27.8, నిడమనూరులో 27.8, మాడ్గులపల్లిలో 21.8, తిర్మలగిరి (సాగర్)లో 20.8, వేములపల్లిలో 18.0, నల్లగొండలో 14.5, తిప్పర్తిలో 14.0, చందంపేటలో 10.8, నకిరేకల్లో 10.8, నార్కట్ పల్లిలో 9.0, కట్టంగూర్లో 8.0, కొండమల్లే పల్లిలో 7.3, పీఏ పల్లిలో 5.5, గుండ్ల పల్లిలో 5.3, కనగల్లో 4.3, గట్టుప్పల్లో 4.0, నాంపల్లిలో 3.8, పెద్దవూర 3.0, నేరేడు గొమ్ము 2.8, చింతపల్లి 2.0, దేవరకొండ, చిట్యాల 2.0, చండూర్లో అత్యల్పంగా 1.5 మిల్లీ మీటర్ల వర్షం పడింది చెరువులకు జలకళ
మేళ్లచెర్వు : మండల వ్యాప్తంగా కురుస్తున్న స్థానిక థంసాచెరువు, నాగులచెరువుతో పాటు కందిబండ చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మెట్ట పంటలు, వరిపంటలు జీవం పోసుకున్నాయి. ఇటీవల ఎండలతో అల్లాడిపోయిన జనం వానలు కురిసి వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
గుడుగుంట్లపాలెంలో కూలిన ప్రహరీ
పాలకవీడు : మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో ఉయ్యాలసోమయ్య ఇంటి ప్రహరీ కూలిం ది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు ఈ వర్షంతో పలు గ్రామాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు జీవం పొసిందని అనందం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు జీవం పోసిన వర్షం
ఆత్మకూర్.ఎస్ : రెండ్రోరోజులుగా కురిసిన వర్షం రైతుల్లో ఆనందాన్ని నింపింది. వాడిపోతున్న పత్తి మొక్కలకు ప్రాణం పోసినట్లయింది. నెల రోజుల నుంచి పెద్దగా వర్షాలు కురవకపోవడంతో ముఖ్యంగా పత్తి పంటపై ఆందోళన నెలకొంది. నల్లరేగడి భూముల్లో కొంత ఇబ్బంది లేకుండా దుబ్బ, ఎర్ర నేలల్లో సాగు చేసిన పత్తి పంటలకు వర్షం కురవడం అత్యంత అవసరంగా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకొని అలుగులు పోయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో మోస్తరు వాన
సూర్యాపేట : జిల్లా వ్యాప్తంగా మంగళ వారం మోస్తరు వర్షం నుంచి చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వాన పడింది. అత్యధికంగా మఠంపల్లి మండలంలో 35.0 మిల్లీ మీటర్ల వర్షం కురవగా కోదాడ 33.5, చిలుకూరు 31.5, నడిగూడెం 26.5, మోతే 26.0, హు జూర్నగర్ 24.0, అనంతగిరి 22.8, చింతలపాలెం 21.0, మెళ్లచెర్వు 20.5, మునగాల 18.5, మద్దిరాల 16.0, నేరుడుచర్ల 13.0, పాలకీడు 12.5, పెన్పమాడ్ 11.0, సూర్యాపేట 10.0 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం పడింది.
ఐదు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన అధికారులు ముందుగానే గేట్లను ఎత్తి నీటి దిగువకు వదులుతున్నారు.ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది.ప్రాజెక్టు గేట్లను ఒక్కో గేటును ఒక అడుగు మేర ఎత్తి 3,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు .కుడి కాలువకు 215.86 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 167.89 క్యూసెక్కుల నీరు వెళుతుంది. మొత్తం 3,664.81 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1013.18 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.ఈ ఇన్ఫ్లో భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.60 అడుగులు (4.09 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.ప్రాజెక్టు వద్ద నిత్యం పర్యవేక్షణ జరుపుతూ ఇన్ఫ్లోను అంచ నా వేస్తున్నామని అధికారులు తెలిపారు.