కట్టంగూర్, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుకు పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో జరుగుతున్న అప్రోచ్ కెనాల్ పనులను శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లిఫ్ట్ పనులు పూర్తయితే మూడు మండలాల్లోని 11గ్రామాల్లో 8వేల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయన్నారు. 10రోజుల్లో మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, హరీశ్రావు చేతుల మీదుగా లిప్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసి 6నెలల్లో పనులు పూర్తి రైతులకు సాగునీరందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, కట్టంగూర్, నకిరేకల్ జడ్పీటీసీలు తరాల బలరాములు, మాద ధనలక్ష్మీనగేశ్, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రీనివాస్, ఏఈ రాశేఖర్రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ వాసుదేవ్, మానిటరింగ్ ఇన్చార్జి జితేంద్ర మునిరాజ, పిడిశెట్టి కృష్ణ, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ గుండగోని రాములు, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, సర్పంచుల, ఎంపీటీసీలు పాల్గొన్నారు.