త్వరలో జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో బేధాభిప్రాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. కోదాడ నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్థానిక నాయకులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నారు. ఆదివారం కోదాడ బీఆర్ఎస్ మాజీ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ భర్త, సూర్యాపేట జిల్లా పెరిక సంఘం నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణ హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిని కలిశారు. పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యం ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని మంత్రులు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. బొల్లం మల్లయ్య గెలుపునకు సమష్టిగా కృషి చేస్తామని శశిధర్రెడ్డి, లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.
సూర్యాపేట, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమైంది. కోదాడ నాయకుల్లో నెలకొన్న చిన్న చిన్న వ్యక్తిగత బేధాభిప్రాయాలపై మంత్రి జగదీశ్రెడ్డి, నియెజక వర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు వరుసగా రెండు రోజులు చర్చలు చేసి సమన్వయం చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు జనం బీఆర్ఎస్ వైపు ఉండగా నాయకత్వంలో భేదాభిప్రాయాలు ఉండవద్దని, పార్టీ కోసం పని చేసే వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తామని కేటీఆర్ అసమ్మతి నేతలకు చెబుతున్నారు. కాగా మంత్రి జగదీశ్రెడ్డి, నియెజక వర్గ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు శనివారం నాడు కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త, సూర్యాపేట జిల్లా పెరిక సంఘం నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణను వెంటబెట్టుకుని కేటీఆర్ను కలిశారు.
ఆదివారం నియెజక వర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కన్మంతరెడ్డి శశిధర్రెడ్డిని హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. మలిదశ ఉద్యమంలో కోదాడ నియోజక వర్గంలో చురుకుగా పనిచేసిన శశిధర్రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలుకాగా తదనంతరం మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల బొల్లం మల్లయ్యయాదవ్కు టికెట్ కేటాయిస్తే అందరూ కలిసి గెలిపించారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ఎవరూ ఊహించని రీతిన ఐదేళ్ల కాలంలో నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
అయితే ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్చార్జీగా పనిచేసిన కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి టిక్కెట్ ఆశించారు. రాజకీయ సమీకరణలతో అధిష్టానం తిరిగి బొల్లం మల్లయ్యయాదవ్కు టిక్కెట్ ఖరారు చేయడంతో శశిధర్రెడ్డి వర్గం కాసింత అలకబూనింది. దాంతో శని, ఆదివారాల్లో చేసిన సమాలోచనల్లో నాయకుల మధ్య చోటుచేసుకున్న సమస్యలకు చెక్ పడింది. వ్యక్తిగత బేధాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దాంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపునకు కృషి చేస్తామని కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, వనపర్తి లక్ష్మీనారాయణ అన్నారు. కోదాడ నియోజక వర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.