విజయ దశమి వేడుకలు సంబురంగా సాగాయి. బుధవారం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలకు ఆయుధ పూజలు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు విందు భోజనాలతో ఆనందంగా గడిపారు. జమ్మి చెట్టుకు శమీ పూజ చేసి అలయ్ బలయ్ ఇచ్చుకున్నారు. పలుచోట్ల రావణాసుర వధ కార్యక్రమాలు నిర్వహించారు.
– రామగిరి, అక్టోబర్ 5
తెలంగాణ సంస్కృతి వైభవానికి దర్పణం పట్టే వేడుక విజయదశమి. 9 రోజుల బతుకమ్మ సంబురాల అనంతరం విజయదశమి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. దేవాలయాల్లో విశేష పూజలు చేశారు. సాయంత్రం శమీ వృక్షం (జమ్మిచెట్టు)ను దర్శించి పూజలు చేశారు. పలు ప్రాంతాల్లో రావణాసుర వధ (దహనం) నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన దసరా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో వాసవిక్లబ్ సిల్వర్స్టార్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శమీపూజ, రావణాసుర వధకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూజలు చేశారు.