చిట్యాల, జూన్ 07 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో గల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు (ఆదివారం) స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శనివారం తెలిపారు.
దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని 2010లో కంచర్ల సోదరులు తమ తండ్రి కంచర్ల మల్లారెడ్డి జ్ఞాపకార్ధం పునర్నిర్మించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వారు స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ పునర్నిర్మాణం జరిగి 15 వసంతాలు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలతో పాటు మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం బొడ్రాయికి జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి మహిళలు బిందెడు నీళ్లతో బొడ్రాయికి అభిషేకం చేశారు.
Chityala : రేపు ఉరుమడ్లలో రామలింగేశ్వరుడి కల్యాణం.. హాజరు కానున్న కేటీఆర్