‘వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గట్టుప్పల్ ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఏడాదిలోగా అద్భుతంగా అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. వచ్చే ఏడాదిలో మరోసారి ఎన్నికల కోసం ప్రజల వద్దకు రావాల్సిందేనని, అందుకే గట్టుప్పల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఆదివారం సాయంత్రం గట్టుప్పల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. మండల వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు తరలిరాగా గట్టుప్పల్ జనసంద్రంగా మారింది. స్థానికులు సైతం ప్రతి ఇంటి నుంచి కదం తొక్కడంతో గల్లీగల్లీ జనంతో కిక్కిరిసిపోయింది. గ్రామంలోని ముఖ్య కూడళ్ల మీదుగా సాగిన రోడ్షో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. బోనాలు, బతుకమ్మలు, కోలాట నృత్యాలు రోడ్షోలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. పుట్టపాక క్రాస్రోడ్డు నుంచి సాగిన రోడ్షోలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి యువనేత కేటీఆర్ దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్23(నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికలో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే.. నియోజకవర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గట్టుప్పల్ ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఏడాదిలోగా అద్భుతంగా అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. మళ్లీ ఏడాదిలో మరోసారి ఎన్నికల కోసం ప్రజల వద్దకు రావాల్సిందేనని, అందుకే గట్టుప్పల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఆదివారం సాయంత్రం గట్టుప్పల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు మండల వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు తరలిరాగా గట్టుప్పల్ జనసంద్రంగా మారింది. స్థానికులు సైతం ప్రతి ఇంటి నుంచి కదం తొక్కడంతో గల్లీ గల్లీ జనంతోనే కిక్కిరిసిపోయింది. గ్రామంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన రోడ్షోలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
మునుగోడు గడ్డపై గులాబీ జెండా అన్న పాటకు మహిళలు డ్యాన్స్ చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. బోనాలు, బతుకమ్మలు, కోలాటనృత్యాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. పుట్టపాక క్రాస్రోడ్డు నుంచి సాగిన రోడ్షోలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, అభ్యర్థి కూసుకంట్ల ప్రభాకర్రెడ్డి, సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి యువనేత కేటీఆర్ దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ విజయసంకేతం చూపుతూ ముందుకు సాగారు. చిన్నపిల్లలకు ఫ్లయింగ్ కిస్సులు విసురుతూ ఆశ్చర్యపరిచారు. రోడ్షో సాగుతున్న దారిలో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని స్వాగతం పలికారు. వారందరినీ పలకరిస్తున్నట్లుగా అభివాదం చేస్తూ.. కూసుకుంట్ల వైపు చూపుతూ ఓటు వేయాలని సూచించారు. మీ ఓటు కారుకే అన్నట్లుగా సైగలు చేస్తూ రోడ్షోలో సందడి చేశారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన రోడ్షోకు దారి పొడవునా వేలాది మంది వెంటసాగారు. అనంతరం గట్టుప్పల్ ప్రధాన కూడలిలో మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తుంటే మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్రెడ్డి నాలుగేండ్లుగా నియోజకవర్గాన్ని అనాథగా వదిలేశారని విమర్శించారు. ఒక్కసారి కూడా నియోజవర్గ సమస్యపై సీఎంను గానీ, తనను గానీ, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డిని గానీ కలిసిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడేమో అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి చేయలేని అభివృద్ధి బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలా చేస్తాడని ప్రశ్నించారు. కాంట్రాక్టరైన రాజగోపాల్రెడ్డి జనాన్ని పట్టించుకోలేదని, కాసులు, కాంట్రాక్టుల కోసమే తిరిగారన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం అని చెబుతున్న మాటలన్నీ బూటకమన్నారు. కాసులు, కాంట్రాక్టులు, కమీషన్ల కోసమంటూ ఎద్దేవా చేశారు.
గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ, ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ, రూపాయి విలువను తగ్గిస్తూ ప్రధాని మోదీ ప్రజలను వంచిస్తున్నాడని మండిపడ్డారు. అలాంటి పార్టీ నుంచి పోటీ చేసే రాజగోపాల్రెడ్డికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని, తర్వాత నియోజకవర్గంతోపాటు గ్రామాన్ని సైతం దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో పాటు తనది కూడా అని ప్రకటించారు. రోడ్షోకు వచ్చిన తనకు గట్టుప్పల్ ప్రజలు అనేక సమస్యలను దృష్టికి తీసుకువచ్చారని వివరించారు. ముఖ్యంగా ఇక్కడి నేతన్నలకు సంబంధించిన నూలు కొనుగోలులో సబ్సిడీ అందించే విషయంలో పలు సూచనలు వచ్చాయని, వాటిని అమలు చేస్తామని చెప్పారు. ఇక జియో ట్యాగింగ్ లో మిస్సైన వారికి మరో అవకాశం కల్పిస్తామని చెప్పారు. గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దేనని, అభివృద్ధి కూడా టీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. గట్టుప్పల్కు రెండు చేనేత క్లస్టర్లు అడిగారని, చండూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేయాలని, 20 పడకల ఆస్పత్రి, డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీరోడ్లు, డ్రైనేజీ, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వీటి పరిష్కారానికి జిల్లా మంత్రితో కలిసి బాధ్యత తీసుకుంటామన్నారు. ఇక ఇప్పటికే నియోజకవర్గంలో 79వేల మందికి రైతుబంధు, 43వేల మందికి ఆసరా పింఛన్లు, 10వేల మందికి కేసీఆర్ కిట్లు, 9,900 మందికి కల్యాణలక్ష్మి, 1,189 మంది రైతుబీమా, చేనేత మిత్ర, నేతన్నలకు చేయూత, నేతన్నలకు బీమా ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చామని వివరించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.
రాజగోపాల్రెడ్డి రాజకీయ నాయకుడు కాదు కాంట్రాక్టర్
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. ఆయన కేవలం కాంట్రాక్టులు, కాసుల కోసం పని చేసే వ్యక్తి మాత్రమే. అలాంటి వ్యక్తిని ఈ ఉప ఎన్నికలో ఇంటికి సాగనంపి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించుకొని మునుగోడును మరింత అభివృద్ధి చేసుకుందాం. గత మూడున్నరేండ్లుగా మంత్రి పదవి, కాంట్రాక్టుల కోసం టీఆర్స్లో చేరేందుకు రాజగోపాల్రెడ్డి శతవిధాలా ప్రయత్నించాడు. అలాంటి వారిని సీఎం కేసీఆర్ దగ్గరకు కూడా రానివ్వరు. ఆయన నేడు 18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మోదీ సంకలో చేరాడు. 2014లో కూసుకుంట్లను గెలిపించిన తరువాత నియోజకవర్గంలో నాడు జరిగిన అభివృద్ధి తప్ప ఈ మూడున్నరేండ్లలో రాజగోపాల్రెడ్డి చేసిందేమీ లేదు. అయినప్పటికీ తాను ముందుండి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ద్వారా అనేక కార్యక్రమాలు చేశాను. నేడు ఉప ఎన్నికలో ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం నందనవనంగా మారడం ఖాయం.
– విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
ఆశీర్వదించండి.. రుణం తీర్చుకుంటా
కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో 2014లో కేసీఆర్ పార్టీ కుటుంబ సభ్యుడిగా మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. నాడు నేను చేసిన అభివృద్ధి తప్ప గత మూడున్నరేండ్లలో రాజగోపాల్రెడ్డి పట్టించుకోలేదు. తన స్వార్థం కోసం రాజీనామా చేయడంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే మరోసారి మీ రుణం తీర్చుకుంటాను. ఈ ప్రాంతంలో కలియతిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడుతాం. ఇప్పటికే ఈ ప్రాంతాలో సాగు నీటి కోసం కేసీఆర్ గొప్ప మనసుతో రూ.2వేల కోట్లతో శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ పనులు మొదలు పెట్టుకున్నాం. 365 రోజులు ఇక్కడే ఉండి మీ సమస్యల్లో పాలు పంచుకొని మీ రుణం తీర్చుకునేలా మరోసారి అవకాశం ఇవ్వండి.
– టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి
ఇవాల ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మీ అందరికీ బాగా తెలుసు. కోమటిరెడ్డి స్వార్థంతో రూ.18వేల కోట్ల కాంట్రాక్టు దక్కించుకొని మన మీద బలవంతంగా రుద్దిన ఎన్నికలివి. రాజగోపాల్రెడ్డి అహంకారానికి, నియోజకవర్గ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అప్పుడే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలుగుతాం.
– కర్నె ప్రభాకర్, మాజీ శాసన మండలి సభ్యుడు
నయా హిట్లర్ మోదీ..
దేశంలో మతతత్వ రాజకీయాలు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ రాక్షస పాలన సాగిస్తున్న మోదీ నయా హిట్లర్గా వ్యవహరిస్తున్నాడు. బీజేపీ రాజకీయ కుట్రలతో.. స్వార్థ రాజకీయాలతో వచ్చిందే మునుగోడు ఉప ఎన్నిక. ఈ ఎన్నికతో రాష్ట్రంతోపాటు దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. రాష్ర్టాన్ని ఆగం చేయడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కార్పొరేట్ శక్తులకు సంస్థలను అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. దేశంలో బీజేపీ రాక్షస పాలన అంతమొందించాలంటే అన్ని శక్తులు ఏకమవ్వాలి. బీజేపీ కుట్రలను ఛేదించాలంటే మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి డిపాజిట్ గల్లంతు చేయాలి. రాష్ట్రం బాగుపడి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ఉంటేనే సాధ్యం. అందుకే వామపక్షాలు బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
– జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
కూసుకుంట్లకు భారీ విజయం ఖాయం
వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ విజయం అందుకోవడం ఖాయం. రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి 18వేల కోట్లకు అమ్ముడుపోవడంతో ఈ ఎన్నిక వచ్చింది. బీజేపీ కుల, మతాలు రెచ్చగొట్టి దేశ ప్రజలపై పన్నుల భారం మోపుతుంది. తెలంగాణలో సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఫ్లోరోసిస్ జాతీయ పరిశోధనా కేంద్రాన్ని తరలించింది. మునుగోడు ప్రజలను డబ్బుతో కొంటామని అహంకారంతో ఈ ఎన్నిక తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులైన ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించి ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెప్పాలి.
– నెల్లికంటి సత్యం సీపీఐ జిల్లా కార్యదర్శి