నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పాటు నాగార్జునసాగర్లో పర్యటించిన కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృందం సభ్యుల పర్యటన మంగళవారంతో ముగిసింది. నాగార్జుసాగర్ డ్యాం ఎడమకాల్వ, డ్యాం గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, డైవర్షన్ టన్నల్, రైట్కెనాల్ తూమ్ గేట్లులను పరిశీలించారు. ఎడమకాల్వ, డ్యాం ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలలోకి కేఆర్యంబీ బృంద సభ్యులను అనుమతించ లేదు. అనంతరం హిల్కాలనీ ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో బృందం సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
నాగార్జునసాగర్ డ్యాం ప్రాజెక్ట్ను నిర్వహణకు సంబంధించిన అంశాలతో ముసాయిదాను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అంతకు ముందు నాగార్జునసాగర్ డ్యాం వద్ద సీపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కేఆర్యంబీ బృంద సభ్యులకు డ్యాంల నిర్వహణపై వినతి పత్రాన్ని అందించారు.