నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (24) ఈనెల 10 వ తేదిన అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించాడు. కాగా, ఆయన భౌతిక దేహం మంగళవారం రాత్రి వారి స్వగ్రామం ఐన అన్నారానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కిరణ్ రెడ్డి నివాసానికి చేరుకొని భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించి మనో ధైర్యం కల్పించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట మాజీ తిప్పన తిప్పన విజయసింహా రెడ్డి, ఎంపీపీ నూకల సరళ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధనవాత్ చిట్టిబాబు నాయక్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పులి జగదీష్, సర్పంచ్ అంబటి వీరారెడ్డి, రవీందర్ నాయక్, పాచునాయక్ తదితరులు పాల్గొన్నారు.