జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్, ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్రబాబు, నమస్తే తెలంగాణ హెచ్ఓడీలు
రామగిరి, డిసెంబర్ 31 : నేటి ఆలోచన రేపటి భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఆ దిశగా ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నేరవేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కరిక్యులమ్, సిలబస్ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించే విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం. ఈ దశలో తప్పటడుగు వేస్తే భవిష్యత్ అంధకారమవుతుంది. రెండేండ్ల ఇంటర్ను ప్రణాళికతో చదివితే జీవితంలో ఏ రంగంలో స్థిరపడాలనేది ఇక్కడే బాటలు వేసుకోవచ్చు అని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కోటేశ్వర్రావు, షణ్ముఖ కుమార్ వివరించారు.
ఇంటర్ తర్వాత ఏం చదువాలి, ఎలా చదువాలి, ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్సుల్లో చేరాలనే విషయాలపై శనివారం నల్లగొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే-కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎన్నో తెలియని విషయాలు తెలియజేసి పై చదువులపై అవగాహన కల్పించారని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచి మేనేజర్ తొవిటి మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, తెలంగాణ టుడే ఇన్చార్జి శ్రీనివాస్, ఏడీవీటీ మేనేజర్ కైరంకొండ శివకుమార్, సిబ్బంది, ప్రగతి జూనియర్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉన్నత విద్యే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ లక్ష్యం
నేటి ఆధునిక కాలంలో ఉన్నత విద్యాభ్యాసం కీలకమైంది. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువాలి. అందులో నాణ్యతా ప్రమాణాలతో కూడిన బోధన అందించే విద్యా సంస్థలు కీలకభూమిక పోషిస్తాయి. దేశంతోపాటు ప్రపంచ దేశాలతో పోటీపడేలా సిద్ధం కావాలంటే అందుకు అనుగుణంగా కరిక్యులమ్ అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇంటర్మీడియట్ పూర్తి చేయబోయే విద్యార్థులు ఉత్తమ బోధన, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్ అందించే ఉన్నత విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి. ఐఐటీ, ఎన్ఐటీలకు దీటుగా న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ 27వ ర్యాంకింగ్తో అత్యత్తుమ ప్రమాణాలతో విద్యాబోధన సాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బాటలు వేస్తున్నది.
విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంగా పని చేస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లో ఇంత అవకాశం ఉన్న ఏకైక ప్రైవేట్ యూనివర్సిటీ ఇదే. ఇక్కడి విద్యార్థులు దేశ, విదేశాల్లో సంవత్సరానికి 45 లక్షల నుంచి ఆ పైన జీతాలు సంపాదిస్తూ స్థిరపడ్డారు. అతి తక్కువ కాలంలోనే కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో వెలుగులోకి వచ్చింది. వంద శాతం ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నాం. ఈ అవకాశాలను వినియోగించుకోవాలి. కేఎల్ వర్సిటీలో చదివే విద్యార్థులు బీటెక్ తృతీయ సంవత్సరంలోనే ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్కు ఎంపికవుతూ సత్తాచాటుతున్నారు. విద్యాలక్ష్మి పోర్టల్తో స్కాలర్షిప్పులు, విద్యారుణాలు పొందే అవకాశం కేఎల్ డీమ్డ్ విద్యార్థులకు ఉంది.
రోజూ యూనివర్సిటీలో లెక్చర్ ట్యుటోరియల్స్, ప్రాక్టీస్తో ఉదయం తరగతులు ముగియగానే మధ్యాహ్నం టీ హబ్కు వెళ్లి అక్కడి అధికారులు, ఉద్యోగులతో ముఖముఖి మాట్లాడుతారు. దాంతో వారిలో ఆత్మ సైర్థ్యం పెరుగుతుంది. బీటెక్ తృతీయ సంవత్సరంలోనే పలువురు విద్యార్థులు కంపెనీలను(స్టార్టప్స్)ప్రారంభిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించే కేఎల్ యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి.
– డాక్టర్ ఎల్.కోటేశ్వర్రావు, ప్రిన్సిపాల్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్ క్యాంపస్
ముందస్తు ప్రణాళికలే విజయానికి సోపానాలు
విద్యార్థి దశలోనే ఇంటర్మీడియట్ కీలకం. భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ఇక్కడే చక్కటి అవకాశాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందుకు ఏం చదువాలి? ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలి? ఏం చదివితే ఎలాంటి ఉద్యోగాలు సాధించవచ్చు? అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో లక్ష్యం -2023తో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇంజినీరింగ్ విద్య ఎంతో కీలకమైంది, దీనిపై అవగాహన లేక ఎవరో చెప్పిన మాటలు నమ్మి కోర్సుల ఎంపికలో తప్పులు చేస్తున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.
దేశంలో ఐఐటీ, ఎన్ఐటీలకు దీటుగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బోధన సాగిస్తూ సాంకేతిక విద్య అందిస్తున్నది. చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్లో స్కిల్స్ సాధించకపోవడంతోనే రూ.10 వేల నుంచి 20 వేలలోపు జీతానికే పని చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సీబీఎస్ఎస్) బోధన అందిస్తూ విద్యార్థి భవిష్యత్కు బాటలు వేస్తున్నాం. అత్యత్తమ ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఉత్తమ విద్య అందిస్తూ జీవితంలో స్థిరపడేలా భరోసా కల్పిస్తున్నాం.
– డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్, సీనియర్ ప్రొఫెసర్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, విజయవాడ క్యాంపస్
కేఎల్ డీమ్డ్లో చేరేందుకు..
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో చేరేందుకు నల్లగొండ, ఖమ్మం జిల్లాల అడ్మిషన్స్ ఇన్చార్జి ఏకస్వామిరెడ్డి(7997995697)ని గానీ, నరేశ్(9000070667)ను గానీ సంప్రదించాలి.
98 శాతం మార్కులు సాధిస్తే ఉచిత విద్య అందిస్తామన్నారు
ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సులో చేరాలో ఇప్పటి వరకు ఆలోచన లేదు. మా కళాశాలలో నమస్తే తెలంగాణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన లక్ష్యం- 2023 సదస్సుతో భవిష్యత్లో ఎలా చదువాలి, ఎలాంటి కోర్సు తీసుకోవాలో తెలిసింది. సదస్సుపై విద్యార్థులు మాట్లాడాలని కోరితే ముందుగా నేను సభా వేదిక వద్దకు వెళ్లి మాట్లాడాను. దాంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ షణ్ముఖ కుమార్ సార్ నా ధైర్యాన్ని మెచ్చుకుని ఇంటర్లో 98 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఉచిత విద్య అందిస్తామని చెప్పారు.
– జ్యోత్స్న, ఎంపీసీ, ఇంటర్ సెకండియర్
విద్యార్థు ప్రయోజనం కోసమే సదస్సులు
విద్యా సమాచారానికి సంబంధించి గతంలో మెట్రో పాలిటన్ సిటీల్లో మాత్రమే సదస్సులు నిర్వహించే వారు. ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించడం అభినందనీయం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కేవలం వార్తలే కాకుండా విద్యా, ఉద్యోగ సమాచారం అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే మా సంస్థలు, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా లక్ష్యం -2023 పేరుతో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలపై జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించాం.
– టి.మహేందర్, బ్రాంచ్ మేనేజర్, నమస్తే తెలంగాణ
అవగాహన సదస్సు చక్కటి అవకాశం
నేటి ఆధునిక ప్రపంచంలో బీటెక్లో ఏ కోర్సులో చేరాలి. ఏ కళాశాల, యూనివర్సిటీని ఎంపికే చేసుకోవాలనే అంశాలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించిన సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఇంటర్లోనే చక్కటి ప్రణాళికతో చదివి ఉత్తమ కోర్సులో చేరాలి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అందించే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలి. నేటి పోటీ ప్రపంచంలో రాణించేలా మా విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన సీనియర్ ఫ్యాకల్టీతో బోధన అందిస్తున్నాం. జేఈఈ, నీట్లో ర్యాంకులు సాధించి ఐఐటీ, ఎన్ఐటీతోపాటు ఎంబీబీఎస్లో సీట్లు సాధించి అటు తల్లిండ్రులు, ఇటు విద్యా సంస్థ పేరు నిలబెడుతున్నాం.
– నరేంద్రబాబు, ప్రిన్సిపాల్, ప్రగతి జూనియర్ కళాశాల, నల్లగొండ
చదువుకు పేదరికం అడ్డుకాదు
చదువుకు పేదరికం అడ్డు కాదు. మా కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు దేశ, వీదేశాల్లో, శాైస్త్రసాంకేతిక సంస్థల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. విద్యార్థులు ఇంటర్ తర్వాత ఉత్తమ విద్యా సంస్థను ఎంపిక చేసుకోవాలిల. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థలకు ప్రాధాన్యమిచ్చి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. దాంతో జీవితంలో ఉన్నత శిఖరాలు చేరవచ్చు.
– ఎన్.శశిధర్రావు , డైరెక్టర్, ప్రగతి జూనియర్ కళాశాల, నల్లగొండ
సదస్సుతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యాలక్ష్మి పోర్టల్తో స్కాలర్షిప్పులు, విద్యా రుణాలు ఇస్తామని తెలుపడం మంచి విషయం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఇది ఎంతో సపోర్టుగా ఉంటుంది. మరో వైపు బీటెక్లో ఎలాంటి కళాశాల ఎంపిక చేసుకోవాలి, ఏ కోర్సులో చేరాలనే విషయాలు తెలుపడం సంతోషం కలిగింది.
– స్వప్న, ఎంపీసీ, ఇంటర్ సెకండియర్