ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, జూన్ 9 : పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రూ.10లక్షలతో నిర్మించనున్న గౌడ సంఘం భవనానికి, రూ.2.5లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులు, పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. రామన్నపేట మండలాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గడిచిన మూడేళ్లలో మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు.
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.6కోట్లు మంజూరవగా, వాటి పనులు సగానికి పైగా పూర్తయ్యాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 9వ వార్డులో కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. అంతకుముందు గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మందడి ఉదయ్రెడ్డి, పోచబోయిన మల్లేశం, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, వనం హర్షిని, ఆమేర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పోతరాజు సాయికుమార్, జాడ సంతోష్, ఉపసర్పంచ్ పొడిచేటి కిషన్, వార్డు సభ్యులు గొలుసుల ప్రసాద్, బాలగోని శివ, లగ్గోని యాదయ్య, లవణం రాధికారాము, జహేరాబేగం, గౌడ సంఘం అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, సంఘం సభ్యులు కూనూరు నర్సింహ, వీరమల్ల లక్ష్మీనారాయణ, నోముల వెంకటేశం, మల్లయ్య, వెంకటయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.