సంస్థాన్ నారాయణపురం, ఫిబ్రవరి 4 : అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతిచెందగా, మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ అండగా ఉంటానని హామీనిచ్చారు. శనివారం వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని రూ.20వేల సాయం అందించారు. చిన్న అమ్మాయి కృష్ణవేణి చదువు బాధ్యత తానే తీసుకుంటున్నాని హామీ ఇచ్చారు. పెద్దమ్మాయి తేజ వివాహానికి ఆర్థిక సాయం అందిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం తన మ నస్సును చలింపజేసిందన్నారు. కథనానికి పలువురు దాతలు స్పందించారు. ఉప్పల లింగస్వామి రూ.2 వేలు, ఉపాధ్యాయుడు నగేశ్ రూ.2వేలు, నిరంజన్ రూ.1,500, రాజురెడ్డి, వెంకటేశ్, నరేందర్ వెయ్యి చొప్పున, జంగయ్య, చిరంజీవి రూ. 500 చొప్పున అందించారు. తమ బతుకుకు భరోసా కల్పించిన నమస్తే తెలంగాణ దిన పత్రికకు రుణపడి ఉంటామని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్టెల భిక్షపతి, ఫౌండేషన్ సభ్యులు నరేందర్రెడ్డి, మహేశ్, రామకృష్ణ, కార్తీక్ గౌడ్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ : కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ చౌటుప్పల్లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో రూ.4.25 లక్షలతో శానిటరీ మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు.