చందంపేట: ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల అడవుల్లోని గుట్టపై నీరు చేరడంతో జలపాతం కొనసాగుతుంది. మండ లంలోని పోగిళ్ల, కంబాలపల్లి గ్రామాల సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి.
పోగిళ్ల గ్రామ సమీపంలోని గవ్వలసరి లోయలో జలపాతం ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో బ్యాక్ వాటర్తో లోయ నిండి నిండుకుండలా కన్పిస్తుండటంతో పర్యాటకులు చూసేందుకు వెళ్తున్నారు. రోజురోజుకు పర్యాటకుల సందడి పెరుగుతూ ఉంది. వర్షం కురిసి 10 రోజులు కావొస్తున్నగుట్టల ప్రాంతం నుంచి జలపాతం పారుతూనే ఉంది.