నల్లగొండ రూరల్, జనవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కోరారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మట్లాడారు. నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ అర్బన్లో-6, నల్లగొండ రూరల్లో-3, కనగల్లో-2, తిప్పర్తిలో-2 సెంటలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు విధిగా ఆధార్ కార్డులు వెంట తెచ్చుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు.
తిప్పర్తి : మండలకేంద్రంలోని రైతు వేధికలో కంటి వెలుగుపై సమావేశం నిర్వహించారు. తాసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ప్రదీప్ బాబు, ఎంపీఓ నర్సింహాస్వామి, ఆరోగ్య సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
నార్కట్పల్లి : పట్టణంలోని పీహెచ్సీలో జిల్లా ఫ్రోగ్రాం ఆఫీసర్ బి. అరుంధతి కంటి వెలుగు ట్రయల్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తాసీల్దార్ మురళి పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మయ్య, తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మండల వైద్యాధికారి వెంకన్న, సుధాకర్, జానకి, జ్యోతి పాల్గొన్నారు.
హాలియా : రెండో విడత కంటి వెలుగుపై హాలియా మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రాజ్కుమార్, తాసీల్దార్ మంగ, ఎంపీడీఓ లక్ష్మి, ఎస్ఐ క్రాంతికుమార్ పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండలకేంద్రంలో కంటి వెలుగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబు, తాసీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్, ఎంపీడీఓ శ్రీపాథ సుధాకర్, మండల వైద్యాధికారి భవానీ చక్రవర్తి, ఏపీఎం మైశేశ్వర్రావు పాల్గొన్నారు.
నందికొండ : నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనుషారెడ్డి అధ్యక్షతన కంటి వెలుగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న నందికొండలోని 1వ వార్డులోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బిర్లా, ఎస్ఐ రాంబాబు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
-మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్
నకిరేకల్ : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ, ఏఈ గౌతమ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
19న ఓగోడు, చందంపల్లిలో..
నకిరేకల్ మండలంలోని ఓగోడు, చందంపల్లిలో ఈనెల 19న కంటివెలుగు శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఓగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి యోగస్వీ తెలిపారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేదల కోసమే కంటి వెలుగు
-మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య
దేవరకొండ రూరల్ : పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 19న పట్టణంలోని 1వ వార్డులో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
కంటి వెలుగుపై విస్తృత ప్రచారం నిర్వహించారు
-ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి
మిర్యాలగూడ రూరల్, జనవరి 17 : కంటి వెలుగుపై విస్కృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి అధికారులను ఆదేశించారు. మండల సమాక్య కార్యాలయంలో కంటివెలుగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీఎంలు కృష్ణమూర్తి, శేషయ్య, ఎంపీఓ వీరారెడ్డి, సీహెచ్ఓ ప్రభాకర్ పాల్గొన్నారు.