కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం విస్తరణ పనులు, గర్భాలయ విస్తరణ, ప్రాకార మండపం విస్తరణ, భక్తుల సౌకర్యార్ధం కోరకు కాలక్షేప మండపం, ప్రసాదం గదుల పనుల కోసం 3కోట్ల నిధులతో పనిచేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు మాస్టర్ ఫ్లాన్ వేస్తున్నారు.
దేవాలయం మాస్టర్ ఫ్లాన్ సైడ్ ఫ్లాంట్ వేయుటకు గురువారం దేవాలయ పరిసర ప్రాంతాల కొలతలను స్ధానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సహకారంతో త్వరలో వివిధ పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఆలయ చైర్మన్ నల్లబోతు యాదగిరి, ఈవో ప్రభాకర్ సత్యమూర్తి అన్నారు.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇంజినీర్లు ఏ రాజేశ్వర్రావు, డీఈ తపతి దామోదర్, ఏఈ రాజయ్య, అర్చకులు మల్లాచారి, శ్రవణాచారి సిబ్బంది చంద్రయ్య, లింగయ్య, లింగస్వామి, ఉమా మహేశ్ తదితరులు పాల్గొన్నారు.