నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం చందంపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, చీరలను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ నున్సవత్ పార్వతి నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లా రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, సిరందాసు కృష్ణయ్య, రమావత్ మోహన్ కృష్ణ, గొసుల అనంతగిరి, బోయపల్లి రాములు గౌడ్, కేతవత్ శంకర్ నాయక్, జక్కుల మున్నయ్య, దేవా, నెహ్రూ, నగిళ్ల మహేష్, మాధవరం శంకర్ రావు, గంగిడి కొండల్ రెడ్డి, ఎంపీడీఓ రాములు నాయక్, పాల్గొన్నారు.