దేవరకొండ, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెలే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు, నేరేడుగొమ్ము మండలానికి చెందిన 16 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీరెలను ఎమ్మెల్యే ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అట్టడుగు వర్గాల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, ఉపాధ్యక్షుడు యాసాని రాజవర్ధన్రెడ్డి, నాయకులు లోకసాని తిరుపతయ్య, మల్లారెడ్డ్డి, బి. శ్రీనివాస్గౌడ్, ఆరేకంటి రాములు, రామకృష్ణయాదవ్, బషీర్, వడ్త్య బాలూనాయక్, కొండల్రెడ్డి, బోయపల్లి రాములు, నాగు, తహసీల్దార్లు పాల్గొన్నారు.