మేళ్లచెర్వు : మహా శివ రాత్రి జాతరలో భాగంగా మేళ్లచెర్వు శంభులింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో తెలుగు రాష్ర్టాల స్థాయి మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఎరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, మేళ్లచెర్వు ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు ప్రారంభించారు.
మొత్తం 16 టీమ్లు పోటీలలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ జ్యోతి, ఎస్ఐ పరమేశ్, శివాలయ చైర్మన్ శంభిరెడ్డి, నిర్వాహకులు పోశం వీరారెడ్డి, వెంకటరెడ్డి, భాస్కర్రెడ్డి, మైహోం ఏజీఎం శ్రీనివాస్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచందర్గౌడ్, నామా నరసింహారావు పాల్గొన్నారు.