బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. గురువారం కొండమల్లేపల్లి మండలం జేత్యతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నాయి.
హుజూర్నగర్ , సెప్టెంబర్ 7: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య రాష్టంలో కనీస అవసరాలు తీరని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాణ్యమైన జీవన ప్రమాణాలు అందుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్పుడు మాత్రమే వచ్చే పగటి వేశగాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. పేదలకు త్వరలోనే ఇండ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్, నాయకులు ప్రదీప్, రాంబాబు పాల్గొన్నారు.