దేవరకొండ, నవంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ శనివారం నియోజకవర్గంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. దేవరకొండ మండలంలోని శేరుపల్లి పెద్దతండాకు చెందిన 100 కుంటుబాలు, చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు, గొడుకొండ్ల గ్రామానికి చెందిన 100 కుటుంబాలు, కొండమల్లేపల్లి మండలంలోని గన్యానాయక్ తండాకు చెందిన 100 కుటుంబాలు ఎమ్మెల్యే రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నాయకుడు గుత్తా అమిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 350 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి చేరాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణలో రైతులకు రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు. రైతులకు 24 గంటలు విద్యుత్ అందించడంతో రెండు పంటలు పుష్కలంగా పండిస్తున్నారని ఆయన చెప్పారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం కావాలని గుత్త అమిత్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, టీవీఎన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ముత్యాల సర్వయ్య, లోకసాని తిరపతయ్య, రమావత్ దశ్రునాయక్, జెడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ ఉన్నారు.
దేవరకొండరూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ప్రజలుబీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని ముదిగొండ గ్రామానికి చెందిన 100 మంది యువకులు శనివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుత్త అమిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంట మారుపాక సురేష్, టీవీయన్రెడ్డి, జైహింద్రెడ్డి, బొడ్డు గోపాల్, రవీందర్రెడ్డి, ఇద్దయ్య, వెంకట్రెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు.
గుడిపల్లి: మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ శీలం శేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత నరసింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ను గెలిపించేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తామన్నారు. మరోమారు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సురబోయిన రమేశ్, బోయ సుధాకర్రెడ్డి, సొనగంటి రవి, కొమిర రాంబాబు, ఓర్సు భిక్షపతి, అర్వపల్లి వెంకటయ్య, గున్రెడ్డి జనార్ధన్రెడ్డి, నిమ్మల నరసింహ, నాయిని విజయరెడ్డి, గోలి శ్రీను, గోలి శ్రీనాథ్, కొట్టె రమేశ్, నేలపట్ల సతీష్, నేలపట్ల గిరి, యాదగిరి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని దేవరకొండ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి గుత్తా అమిత్రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ నియోజకవర్గం ముఖ్యకార్యకర్తల సమావేశం సాయిరమ్య ఫం క్షన్హాల్లో జరిగింది. ఈ సందర్బంగా గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ను భారీ మేజార్టీతో గెలుపించుకోవాలని ఆయన కోరారు. కార్యక ర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. 25 రోజులు గ్రామాల్లో కష్టపడి ప్రచారం చేస్తే రాష్ట్రంలో మూడో సారి సీఎం కేసీఆర్, దేవరకొం డలో నాలుగో సారి ఎమ్మెల్యేగా రవీంద్రకు మా ర్ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకు మార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో వచ్చిన 39వేల మెజార్టీ కంటే రెట్టింపు ఇవ్వాలని ఆయన కోరారు. ఎంపీపీలు వంగాల ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీలు మాధవరం దేవేందర్రా వు, కేతావత్ లాలునాయక్, లోకసాని తిరుపత య్య, దొంతం చంద్రశేఖర్రెడ్డి, రమావత్ దశ్రునా యక్, రాజీనేని వెంకటేశ్వర్ రావు, వైస్ చైర్మన్ రహత్అలీ, చింతపల్లి సుభాష్గౌడ్, కంకణాల వెంకట్రెడ్డి, హన్మంత్ వెంకటేష్ గౌడ్, మారుపా కుల సురేష్గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.