బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన భరోసా అని, మన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కుడకుడ రెండో వార్డు ఎస్సీ కాలనీలో మంత్రి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మొదటగా సవారి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, విపక్షాల కుట్రలను తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వనివి కూడా అమలు చేశామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ అభివృద్ధి నెక్స్ లెవల్కు చేరబోతుందని, ప్రజలు బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలువాలని కోరారు.
సూర్యాపేటటౌన్, అక్టోబర్ 26 : రాష్ట్రంలో పదేళ్లలో కాలంలోనే వందేండ్ల అభివృద్ధి చేసి చూపించన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గడప గడపకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేరుతో గురువారం సూర్యాపేటలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పట్టణంలోని కుడకుడ 2వ వార్డు ఎస్సీ కాలనీలో ప్రచారం చేపట్టారు. మొదటగా సవారి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిని అమ్మవారికి అందజేశారు.
అనంతరం కాలనీలో తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అందజేసి చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మంత్రికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసా అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. రైతులకు రూ.35 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
రైతులకే అన్నం దొరకని పరిస్థితుల నుంచి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంతో పాటు అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారందరికీ అందజేసినట్లు చెప్పారు. కుటుంబ పెద్ద మరణిస్తే 10 రోజుల్లోనే రూ.5 లక్షలు వచ్చేలా ప్రవేశ పెట్టబోయే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా అన్నారు. కేసీఆర్ బీమాతో రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసే అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్ రూ.5,016, దివ్యాగులకు రూ.6 వేల పెన్షన్ పెంపు, రైతు బంధె రూ.16 వేలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్ ఆరోగ్య రక్షకు రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మికి రూ.3 వేలతో మహిళలకు జీవనభృతి, రూ.400 కే గ్యాస్ సిలిండర్, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు, గృహలక్ష్మి కింద ఇండ్లు కట్టించి ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
సూర్యాపేటటౌన్ : బొట్టు పెడుతూ.. మ్యానిఫెస్టోను వివరిస్తూ బీఆర్ఎస్ సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సతీమణి సునీత గురువారం సూర్యాపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 33వ వార్డులో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన జగదీశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు.
మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ బీఆర్ఎస్
బొడ్రాయిబజార్ : మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ బీఆర్ఎస్ అని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ పట్టణంలోని 9వ వార్డులో పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజలకు ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని రెట్టింపు పథకాలతో వస్తున్న బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు నాయకులు గుండగాని నాగభూషణం, మద్దూరి కుమార్, నీలాల లక్ష్మయ్య, మచ్చ రాము, బొడ్డు దుర్గయ్య, గొంతుల ఉపేందర్, ఈదుల లక్ష్మయ్య, నవిలె విజయ్, గుంజ శ్రీను, బొజ్జ సందీప, గడ్డం వెంకటేశ్, కుమ్మరి శ్రీకాంత్, అనుములపురి వినయ్, పందిరి సువర్ణ, నీలా నాయక్, నర్రా సువార్ద, బొల్లెద్దు విజయ, బండారి కమల్, బాలెంల సాయికుమార్, పిట్టల శివ, బొజ్జ గోపి, షేక్ నయీంతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి జగదీశ్రెడ్డిని మరోమారు భారీ మెజారిటీతో గెలిపించాలని జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. మండలంలోని రాంమ్లాతండాలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. తండావాసుల కాళ్లు మొక్కి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోతు స్వప్న, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వాంకుడోతు సేవానాయక్, వాంకుడోతు నాగరాజు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : అభివృద్ధి ప్రదాత మంత్రి జగదీశ్రెడ్డిని శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయనున్నదో మ్యానిఫెస్టో ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ మిర్యాల వెంకట్రెడ్డి, బోళ్ల వెంకట్రెడ్డి, బ్రహ్మం, మిర్యాల వనజ శేఖర్రెడ్డి, రంగారెడ్డి, గునిగంటి భిక్షం పాల్గొన్నారు.