తుంగతుర్తి, ఆగస్టు 22 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తల తుంగతుర్తి మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండలం వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లింగమూర్తికి వినతిపత్రం అందించి మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు మల్లెపాక సునీత, మల్లెపాక కోయిల తదితరులు పాల్గొన్నారు.