భువనగిరి అర్బన్, జనవరి 30 : ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు గురువారం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ రమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 16నుంచి ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్, 17న ఎథిక్స్, మానవ విలువలు, 19న ఎన్విరాన్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.