మునుగోడు, మే 29 : మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీఓ విజయభాస్కర్ గురువారం పరిశీలించారు. గ్రామంలో ప్రతి వీధి, వీధి తిరుగుతూ పరిసరాలను పరిశీలిస్తూ చెత్త వేస్తున్న ప్రదేశాలను గుర్తించారు. మరుగునీరు వీధిలోకి వస్తున్న ప్రదేశాలను గుర్తించి, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాదగోని రాజేశ్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్, వాటర్మెన్ శంకరయ్య, గాదె లక్ష్మి, గాదె సైదమ్మ పాల్గొన్నారు.