మోత్కూరు, జూలై10 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరు తో బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కొండగడప రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం మోత్కూరు తాహసీల్ కార్యాలయం ఎదు ట వారు ఎడ్ల బండ్లతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశా రు. బిక్కేరు వాగు నుంచి ఇసుకను తరలించరాదంటూ 2022లో హైకోర్డు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి తాసీల్దార్ జ్యోతి అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ఇసుక తరలింపునకు అనుమతులిచ్చారని, ఆ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. తాసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆమె వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు ఎడ్ల బండ్లను అక్కడే విడిచి కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. జీవనోపాధి కోసం ఎడ్ల బండ్లు కొనుగోలు చేసి, ఇసుక ను బాడుగ తోలి బతుకుతున్నామన్నారు. తమను కాద ని ట్రాక్టర్లతో ఇసుకను తరలించొద్దన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక ఒక్క ట్రిప్పుకు అనుమతి తీసుకొని 10 ట్రిప్పులు తరలిస్తున్నారని, ఒక్కో ట్రిప్పుకు రూ. 3వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ట్రాక్టర్ల తో ఇసుక తరలింపును విరమించుకోవాలన్నారు.
బిక్కేరు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలించొద్దని, ఎడ్లబండ్ల ద్వారానే అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్ల నరేశ్ పేర్కొంటూ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తోందన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించా రు. కార్యక్రమంలో రైతులు తొంట శ్రీనివాస్, బుంగ భిక్షం, ముత్యాలు, ఉప్పలయ్య, ఎల్లయ్య, ఎల్ నరేశ్, భాస్కర్, తొంట గిరి, లింగస్వామి, యెర్రవెల్లి నర్సయ్య, లొడంగి మల్లేశ్, దండేబోయిన మల్లయ్య, యాకస్వామి, రాములు, మధు పాల్గొన్నారు.