పెద్దఅడిశర్లపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగర్కు వరద భారీగా చేరడంతో మండలంలోని ధర్మారేఖ్య తండా వాసు లు అజ్మాపురం శివారుల్లోని తమ భూముల వద్దకు పోవడానికి పేర్వాల వాగులో నిలిచిన వెనుక జాలలో నీటి తెప్పపై ప్రయాణించాల్సిందే. ఇటీవల సాగర్కు భారీగా వరద చేరడంతో తండా తమ పొలాలకు నడుమ వాగులో నీరు నిలిచింది.
దీంతో దాదాపు 200 మంది రైతులు నిత్యం ఇలా నీటి తెప్పలపై కూలీలను తరలించడంతో పాటు పండిన పంటలను కూడా వాటిపై వాగు దాటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే తమ కష్టాలు తీరుతాయని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను ధర్మారేఖ్య తండా వాసులు కోరుతున్నారు.