నిడమనూరు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మారుపాక-గోవిందన్న గూడెం గ్రామాల నడుమ నాన్ ప్లాన్ నిధులు రూ.2.78 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నీటిపారుదల, పంచా యతీరాజ్, ఆర్అండ్బీ శాఖల పరిధిలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో పల్లెల సమగ్రాభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.
వంతెన నిర్మాణంతో మాదారం మీదుగా నల్లగొండకు వెళ్లేందుకు మెరుగైన సౌకర్యం కలుగుతుందని, ప్రజలు, ప్రజాప్రతినిధులు పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ గోపు నాగలక్ష్మి, ఎంపీటీసీ చం ద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు బొల్లం రవియాదవ్, చిత్రం జీవన్ రావు, ఉప సర్పంచ్ నందికొండ సైదయ్య, నందికొండ శ్రీనివాస్, సింగం రామలింగయ్య, మెరుగు రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.