మునుగోడు, డిసెంబర్ 29 : మునుగోడు వాసి, జ్యోతిష్యశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మునగాల యాదగిరి ఆచార్యులును మునుగోడు పట్టణ 3 వార్డు మెంబర్ పందుల ప్రియాంక లింగస్వామి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరి ఆచూర్యులు మునుగోడు పట్టణ వ్యక్తి కావడం తామంతా గర్వించదగ్గ విషయం అన్నారు. మునుగోడు మండల కేంద్రానికి చెందిన పంచాంగ సిద్ధాంతి, జ్యోతిష్యులు మునగాల యాదగిరి ఆచార్యులు ఈ నెల 14న మధురైలో జ్యోతిష్య యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి జ్యోతిష్య పరిశోధనలో డాక్టరేట్ పట్టా పొందారు. నక్షత్ర నాడీ సిద్ధాంతం మీనా2 పద్ధతిలో జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎలాంటి గ్రహ స్థితి వల్ల పొందుతారనే విషయంపై ప్రొ.డా.శరవన్ కుమార్ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. జ్యోతిష్య యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొ.డా.ఎన్ వి.ఆర్ రాజా, సి.ఇ.ఓ ప్రొ.డా హైమావతి, పలువురు జ్యోతిష్య శాస్త్ర పరిశోధకుల సమక్షంలో మునగాల యాదగిరి ఆచార్యులు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగశేఖర్, రేవెల్లి సైదులు, పామనుగుళ్ల నవీన్ కుమార్, మునగాల సీతయ్య, పందుల సురేశ్ పాల్గొన్నారు.