హాలియా, డిసెంబర్ 7 : ఆడబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. పెద్దవూర మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందించారు. గుర్రంపోడు, పెద్దవూర మండలాలకు చెందిన 32 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడబిడ్డల పెండ్లికి వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ఇలాంటి పథకం లేదన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ సైదులు, పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవి నాయక్, కోఆప్షన్ సభ్యుడు బషీర్, గుర్రంపోడు వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్, ఎంపీటీసీ సుజాతాపాండునాయక్, సర్పంచులు శ్రీను, ఆంజనేయులు, కృష్ణ, శంకర్, చిన్న, నాయకులు అహ్మద్ అలీ, రాజేశ్ నాయక్, మల్లికార్జున్ నాయక్, శివాజి, రావుల లింగయ్య, ఎన్నమల్ల సత్యం, రామలింగయ్య, గుంటుక వెంకట్రెడ్డి, రవి నాయక్, షేక్ బషీర్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
గుర్రంపోడు : ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్బంగా బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుజయ్, ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, తాసీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, యువజన విభాగం మండలాధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్గౌడ్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు షేక్ సిరాజ్, సర్పంచులు చాడ చక్రవర్తి, జక్కల భాస్కర్, బద్రి యాదయ్య, కేసాని యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
పార్వతమ్మకు నివాళి
ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దోటి చంద్రమౌళి మాతృమూర్తి పార్వతమ్మ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నోముల భగత్ మండలంలోని చామలేడు గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. పార్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.