నల్లగొండ, డిసెంబర్ 20 : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంగ్లిష్ మీడియం ఐదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ రీజనల్ కో ఆర్డినేటర్ అరుణకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 11, 2024న ఆయా కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4 తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. రూ.100 చెల్లించి http/tswreis.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని
సూచించారు.