మిర్యాలగూడ, జనవరి 7 : మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ వైస్చైర్మన్ దివంగత కుర్ర కోటేశ్వర్రావు చేసిన సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని నందిపాడులోని టీఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన కోటేశ్వర్రావు సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి కోటేశ్వర్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మండలి చైర్మన్ మాట్లాడుతూ మిర్యాలగూడ అభివృద్ధికి కోటేశ్వర్రావు అనేక కార్యక్రమాలు చేపట్టి ఇక్కడి ప్రజల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన మృతి పట్టణ ప్రజలకు తీరని లోటన్నారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ కోటేశ్వర్రావు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూకలంటి రంగారెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సీడీ.రవికుమార్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసీన్అలీ, నాయకులు గుత్తా అమిత్రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, చిట్టిబాబునాయక్, జొన్నలగడ్డ రంగారెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.