మిర్యాలగూడ, జనవరి 19 : రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి మిర్యాలగూడ పట్టణంతో పాటు, వేములపల్లి, మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కోట్లాది మంది పేదల కళ్లల్లో వెలుగులు నింపేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రెండోసారి నిర్వహిస్తున్నారని తెలిపారు.
పేదల్లో అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమం ప్రవేశపెట్టి వెలుగులు నింపుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజావైద్యం బలోపేతమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు కంటి పరీక్షలు చేసి వారి కళ్లల్లో వెలుగులు నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కొనియాడారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు భరోసా కల్పిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కుష్బూ, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి, ఎంపీపీలు సరళాహనుమంతరెడ్డి, సునీత, జడ్పీటీసీ మంగమ్మ, మున్సిపల్ కమిషనర్ రవీందర్సాగర్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.