భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 10 : సాంఘిక సంక్షేమ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఆదివారం జిల్లాలో నిర్వహంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. భువనగిరిలో 360, రాజాపేటలో 336, అడ్డగూడూరులో 360, ఆలేరులో 312, చౌటుప్పల్లో 360, వలిగొండలో 362, వలిగొండ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 240 మంది కలిపి మొత్తం 2,330 మంది విద్యార్థుల పరీక్షకు హాజరుకానున్నారు.
ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు ఎ.భాసరరావు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం తన చాంబర్లో రీజనల్ కో-ఆర్డినేటరు శ్రీరాం శ్రీనివాస్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షా ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె.పార్థసింహారెడ్డి, ఉన్నారు.