గుర్రంపోడు: మత్స్య కార్మికులకు ఉపాధితో పాటు గ్రామీణ సంపద వృద్ధ్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేపపిల్లల పెంపకం పథకా న్ని అమలు చేస్తున్నారని నాగార్జునా సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని ఊర చెరువులో లక్షా 80 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 26 చెరువుల్లో 25 లక్షల చేప పిల్లలను పెంచడం జరుగుతుందని అన్నారు.
మత్స్య కార్మికులకు చేపల అమ్మకానికి గాను ప్రభుత్వం వాహానాలను సైతం అందజేస్తున్నదన్నారు. కుల వృత్తులపై ఆధార పడిన వారు తమ పిల్లలను ఉన్నత చదువులకు చదివించుకొనేలా ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఆయా వృత్తులను పోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం. వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1230 చెరువుల్లో ఆరు కోట్ల ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్, సర్పంచ్ షేక్ మస్రత్ సయ్యద్మియా, ఎంపీటీసీ కుప్ప రాములు, మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ఎఫ్డీవో ఈసం మారయ్య, మండల ఉపాధ్యక్షుడు వెలుగు రవి, సర్పంచ్ రావుల పాటి భాస్కర్, పార్టీ యువజన మండలాధ్యక్షుడు కుప్ప పృధ్వీరాజ్, నాయకులు వెలుగు యాదయ్య, సత్యనారాయణ, వజ్జ ధనుంజయ, కిరణ్కుమార్, కంచర్ల శ్రీవాణి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.