బొడ్రాయిబజార్, జనవరి 1 : ‘2023 సంవత్సరంలో అందరి జీవితాల్లో నూతన వెలుగులు నిండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు వినూత్న రీతిలో అందిస్తున్న సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిద్దాం. సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ మరింత ఆదర్శంగా నిలుద్దాం.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీశ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది. మంత్రికి మొక్కలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా నాటి ఉద్యమ రథసారధి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్లుగా నిరంతరం అభివృద్ధి పాలనే లక్ష్యంగా వినూత్న పథకాలతో రాష్ర్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న రాష్ర్టాన్ని ఎవరూ ఊహించని రీతిలో తీర్చిదిద్దుతూ అన్ని రాష్ర్టాలు మన అభివృద్ధి వైపు చూసేలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇప్పటికే నీళ్లు, నిధులు పుష్కలంగా అంది తెలంగాణ సస్యశ్యామలంగా మారడంతోపాటు ఇటీవల విడుదలైన వరుస ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం మొదలైందని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి మంచి ఉద్యోగం పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నిరంతర విద్యుత్, పుష్కలంగా తాగు, సాగునీరు, ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, అమ్మఒడి, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రూపురేఖలు మార్చాయన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే 2022 కూడా వచ్చి వెళ్లిపోయిందని.. కాలం ఎవరి కోసమూ ఆగదని, అందుకే సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
2023 ఏడాదంతా అందరికీ మంచి జరుగాలని, మరింత అభివృద్ధితో ముందుకు సాగుదామని ఆకాంక్షించారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరి, రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్రావు, ఏఎస్పీ కేఆర్కే ప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పెద్దగట్టు ఆలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట, కోదాడ డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్రెడ్డి, పీడీ కిరణ్కుమార్, డీపీఆర్ఓ రమేశ్తోపాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు ఉన్నారు.