ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. అభిమాన నేత పుట్టిన రోజును శుక్రవారం
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు అట్టహాసంగా జరిపారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాలు
చేపట్టారు. వృద్ధులు, అనాథలకు, దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటి గులాబీ దళపతి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.
– యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17
(నమస్తే తెలంగాణ)
తిరుమలగిరి, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని శ్రవంతీసతీశ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.
చౌటుప్పల్, ఫిబ్రవరి 17 : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ఎమ్మెల్యే కేక్ కట్ సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతల దామోదర్రెడ్డి, గుత్తా ఉమాదేవి, బొడ్డు శ్రీనివాస్రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, కళ్లెం శ్రీనివాస్రెడ్డి, కరంటోతు నర్సింహనాయక్, వెంకటేశం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి పలువురికి పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ముఖ్యమంత్రి పేరిట ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సువర్ణపుష్పార్చనలో పాల్గొని కేసీఆర్ పేరిట సంకల్పం జరిపించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ఎన్ఎస్పీ క్యాంపులో మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నాయకులు నాగార్జునాచారి, యాదగిరిరెడ్డి, విష్ణు, చిట్టిబాబునాయక్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
కోదాడ టౌన్, ఫిబ్రవరి 17 : అందరూ కారణజన్ములు కాలేరని, ప్రజల కోసం పని చేసినవారే కారణజన్ములవుతారని, పోరాట యోధుడు సీఎం కేసీఆర్ అందులో ఒకరని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని తమ్మర బ్రిడ్జి వద్ద మొక్కలు నాటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పట్టణంలోని మార్కెట్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మామధుసూదన్, పార్టీ నాయకులు ఇర్ల రోజారమణి, చందు నాగేశ్వర్రావు, సత్యంబాబు, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాలియా, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హాలియాలోని మినీ స్టేడియంలో సీకే యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా 8వేల గ్రామ మపంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని అన్నారు. కార్యక్రమంలో హాలియా, తిరుమలగిరి సాగర్, పెద్దవూర ఎంపీపీలు సుమతీపురుషోత్తం, ఆంగోతు భగవాన్నాయక్, అనూరాధ సుందర్రెడ్డి, తిరుమలగిరి జడ్పీటీసీ సూర్యభాష్యానాయక్, తిరుమలగిరి సాగర్ వైస్ ఎంపీపీ దిలీప్రెడ్డి, వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, రావుల చిన భిక్షం తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలనేదే ప్రజల ఆకాంక్ష
నకిరేకల్, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భగా నకిరేకల్ పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డితో కలిసి ఎంపీ బడుగుల ప్రారంభించారు. అంతకుముందు కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాం, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దేవరకొండ, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి దేశ వ్యా ప్తంగా మద్దతు లభిస్తున్నదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమాణికమన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రహ్మత్అలీ, పార్టీ నాయకులు శిరందాసు కృష్ణ య్య, హన్మంతు వెంకటేశ్గౌడ్, వెంకటేశ్వర్లు, దేవేందర్నాయక్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.
హాలియా, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని, ఆయనతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమై.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. హాలియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, హాలియా, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, రవినాయక్, సత్యపాల్, చెరుపల్లి ముత్యాలు, ఎన్నమల్ల సత్యం, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.