మునుగోడు, ఫిబ్రవరి 10 : మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పలు సమస్యలను సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లగా సర్పంచ్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అబివృద్ధి చేస్తానని, ఒకొక్క సమస్య విడతల వారీగా పరిష్కరిస్తామని, గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.