తుంగతుర్తి, ఏప్రిల్ 13 : అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధాన్యం క్వింటా కు రూ. 500 బోనస్ ఇవ్వాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలం బండరామారం ఐకేపీ సెంటర్ వద్ద శనివారం బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వీరబోయిన రమేశ్, మాజీ సర్పంచ్ గడ్డం ఉప్పలయ్య, ఆకారపు సైదులు, నాయకులు పులు సు ఉప్పలయ్య, సోమనర్సయ్య, దేవేంద్ర, బక్క య్య, నరేశ్, వీరసోములు పాల్గొన్నారు.