నల్లగొండ రూరల్, ఏప్రిల్ 10 : మండలంలోని రెడ్డి కాలనీ గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నారు.
రెండు సొసైటీల మధ్య గొడవతో ఆగిన కొనుగోళ్లు ఆధికారుల ఆదేశంతో ఒక్కటై కొనుగోళ్లు చేపట్టారు. దాంతో రైతులు హర్ష వ్యక్తం చేశారు.