తుంగతుర్తి, ఏప్రిల్ 1 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెలుగుపల్లి శివారులో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినట్లయితే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,203 ధర పలుకుతుందన్నారు.
జిల్లాలో మొత్తం 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 72 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎండ తీవ్రంగా ఉన్నందున రైతులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్బాబు, తాసీల్దార్ చామల రమణారెడ్డి, ఎంపీడీఓ భీమ్సింగ్నాయక్, ఐకేపీ ఏపీఎం నర్సయ్య, ఇన్చార్జి సీసీ నర్మదా పాల్గొన్నారు.
మద్దిరాల : మండల కేంద్రంతో పాటు గోరెంట్ల స్టేజీ వద్ద మండల సమాఖ్య, సంఘ బంధం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ ఏపీడీ సురే శ్ ప్రారంభించారు. ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, తాసీల్దార్ అమీన్సింగ్, ఏఓ వికాస్ పాటిల్, ఏపీఎం మైసయ్య పాల్గొన్నారు.
పెన్పహాడ్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఏపీఎం అజయ్నాయక్ అన్నారు.
మండల పరిధిలోని మహ్మదాపురం, అనాజీపురం గ్రామాల్లో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. ఏఓ కృష్ణసందీప్, ఏఈఓ రేణుక, సీసీ చెన్నయ్య, కార్యదర్శులు నాగేశ్వర్రావు, జానీ, వీఓఏలు ధనలక్ష్మి, విజయ, నీరజ, సుమతి, ఇందిరమ్మ, లక్ష్మి, మమత, కళమ్మ పాల్గొన్నారు.
నాగారం : మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ బ్రహ్మయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం తరాల శోభారాణి, సీసీ రామయ్య, వీఓ కడియం విజయలక్ష్మి పాల్గొన్నారు.
అర్వపల్లి : అర్వపల్లి, జాజిరెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం వలిశెట్టి మల్లేశ్ ప్రారంభించారు. ఆర్ఐ వెంకటఖరెడ్డి, సీసీలు నగేశ్, పద్మావతి, సంఘ బంధం అధ్యక్షులు సునీత, కరుణశ్రీ, రమణ, వీఓఏలు కృష్ణకుమారి, సురాంభ, పద్మ, నర్సింగ శ్రీనివాస్గౌడ్, శిగ నసీర్గౌడ్, దాసరి సోమయ్య పాల్గొన్నారు.
మోతె : మండల పరిధిలోని ఉర్లుగొండ, తుమ్మగూడెం గ్రామాల్లో పీఏసీఎస్ సర్వారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ ఉయ్యాల కార్తీక్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ దోసపాటి ఉపేందర్ పాల్గొన్నారు.
చిలుకూరు : చిలుకూరులోని సంఘ బంధం ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాన్ని తాసీల్దార్ దవకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం దుర్గాప్రసాద్, ఆర్ఐ సీతయ్య, మంజుల, సిబ్బంది గురుమూర్తి, కోటేశ్వరి, వీఏఓలు, రైతులు పాల్గొన్నారు.