రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూర్.ఎస్ మండలం కందగట్ల, గట్టికల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ముందుకు రాకున్నా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నదని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు.
ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 21 : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కందగట్ల, గట్టికల్లు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. గట్టికల్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు చెప్పారు. అనంతరం కందగట్ల గ్రామంలోని బి.కలమ్మకు రూ.60 వేల సీఎం సహాయ నిధి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, బత్తుల ప్రసాద్, ముద్దం కృష్ణారెడ్డి, తాసీల్దార్ పుష్ప, ఎంపీడీఓ మన్సూర్నాయక్, ఆర్ఐ అంజయ్య, బ్రహ్మం, సర్పంచ్ ముద్దం శేషమ్మ, సాలమ్మ, వెంకట్రెడ్డి, మడ్డి విజయ్, రమేశ్ పాల్గొన్నారు.