ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ, జూన్ 5 : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని గొట్టిముక్కల రిజార్వాయర్లో ముంపునకు గురైన లింగన్నబావి, పూతలరాంతండాకు చెందిన 110 మంది నిర్వాసితులుక ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతపల్లి గేట్ వద్ద ఆర్ అండ్ ఆర్ సెంటర్లో రూ. 2.76 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అంగన్వాడీ భవనం, వాటర్ ట్యాంక్ల నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ కింద ముంపునకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.
రిజర్వాయర్ పనులు 95 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తయితే అత్యధికంగా రిజర్వాయర్లు ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు వస్తుందని రవీంద్రకుమార్ తెలిపారు.ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించేలా చేయ డమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, జెడ్పీటీసీ అరుణాసురేశ్గౌడ్, ఆర్డీఓ గోపిరాం, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, తాసీల్దార్ కిరణ్మయి, సర్పంచ్ అయన్న బద్యానాయక్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.