ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
భువనగిరి కలెక్టరేట్, జూలై 4 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ్ణారెడ్డి అన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, చందుపట్ల బండసోమారం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి సమిష్ఠి కృషితో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచులు మాకోలు సత్తయ్య, చిన్నం పాండు, నానం పద్మాకృష్ణగౌడ్, జక్క కవితారాఘవేందర్రెడ్డి, ఎంపీటీసీ బొక్క కొండల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.